News January 30, 2025
2 పరుగులకే 6 వికెట్లు.. శార్దూల్ హ్యాట్రిక్

రంజీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బౌలర్లు అదరగొట్టారు. 2 పరుగులకే 6 వికెట్లు కూల్చేశారు. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సహా 4, మోహిత్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, అర్పిత్ సుభాష్ 2 పరుగులు చేశారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్ చేతిలో ముంబై అనూహ్యంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో శార్దూల్ సెంచరీ చేశారు.
Similar News
News January 2, 2026
వికారాబాద్: ఈ ఫ్యామిలీ GREAT

‘కలసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం’ అంటుంది VKBలోని బొంరాస్పేట మండలానికి చెందిన నీరటి నర్సమ్మ కుటుంబం. కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న తరుణంలో నేటికీ మేము కలిసే ఉంటున్నామంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమెకు మొత్తం నలుగురు కుమారులు, వారి భార్యలు, ఆరుగురు మనవళ్లు,11 మంది మనవరాళ్లు, ముని మనవడు, ముని మనువరాలు మొత్తం 27 మంది ఒకే దగ్గర ఉంటూ అన్ని కార్యక్రమాలను కలిసి నిర్వహించుకుంటున్నారు.
News January 2, 2026
బాక్సాఫీసును షేక్ చేసే సినిమా ఏది?

2025లో టాలీవుడ్ నుంచి ‘OG’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మినహా ఏ సినిమా రూ.300Cr+ కలెక్ట్ చేయలేదు. ధురంధర్, చావా, కాంతార: ఛాప్టర్-1 వంటి ఇతర భాషల సినిమాలు రూ.700cr+ రాబట్టాయి. దీంతో ఈ ఏడాది రిలీజయ్యే టాలీవుడ్ భారీ ప్రాజెక్టులు బాక్సాఫీసు వద్ద ఏ మేరకు రాణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ‘రాజాసాబ్, ఫౌజీ’, NTR ‘డ్రాగన్’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు ఈ లిస్టులో ఉన్నాయి.
News January 2, 2026
టికెట్ కొనాల్సిందే.. ఇంద్రకీలాద్రిపై కొత్త విధానం!

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సిఫార్సుల ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ టికెట్లు కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు. ఈ మార్పు వలన ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దుర్గగుడికి సిఫార్సుల జాబితాలో దర్శనాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


