News January 30, 2025

రాయచోటి: మృతుడి పిల్లలకు రూ.లక్ష చెక్కు అందజేత

image

అధ్యాపకుడి పిల్లలకు రూ.లక్ష సాయాన్ని DRO మదన్ మోహనరావు బుధవారం రాయచోటిలో అందజేశారు. తంబళ్లపల్లె ఎకనామిక్స్ లెక్చరర్ వెంకటరమణ మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. కలెక్టరేట్లో DIEO కృష్ణయ్య, ప్రిన్సిపాల్ అమరేంద్ర తదితరులు లెక్చరర్ చనిపోయి పిల్లలు అనాధలైన విషయాన్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి విన్నవించారు. కలెక్టర్ రూ.లక్ష చెక్కు, మరో రూ.72వేలు అకౌంట్లో వేశారు.

Similar News

News November 10, 2025

గుర్తింపు కార్డు ఉంటేనే విశ్వవిద్యాలయంలోకి అనుమతి

image

AUలో భద్రతతో పాటు అనధికారిక వ్యక్తులను నియంత్రణలో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టింది. విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులు, బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విధులు నిర్వహించే సమయంలో ధరించాలని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. గుర్తింపు కార్డులు ధరించని విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులను, విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి అనుమతించబోమన్నారు.

News November 10, 2025

19న మహిళలకు చీరల పంపిణీ

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.

News November 10, 2025

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు సూసైడ్

image

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మద్యం మానుకోవడంలేదని పెనుకొండ(M) గుట్టూరులో బిహార్‌కు చెందిన PK రాయ్ భార్య అంజలికుమారి ఉరేసుకుంది. భర్త కియాలో పనిచేస్తాడు. ధర్మవరంలో భవన నిర్మాణ కూలీ శివ(36) మద్యానికి డబ్బులు ఖర్చు చేస్తున్నాడని భార్య నవనీత ప్రశ్నించడంతో ఉరేసుకున్నాడు. మకడశిర(M) మణూరుకు చెందిన మతిస్థిమితం లేని కదురప్ప(46) చెట్టుకు ఉరేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.