News January 30, 2025

విశాఖలో కేంద్రమంత్రి కాన్వాయ్‌లో ప్రమాదం

image

విశాఖలో కేంద్రమంత్రి కుమార్‌ స్వామి, సహాయమంత్రి శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. షీలా నగర్ వద్ద 8 కార్ల కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతినగా మంత్రులు క్షేమంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 17, 2025

అనకాపల్లి: 30 రోజుల్లో 14,86,513 మహిళలు ఉచిత ప్రయాణం

image

స్త్రీ శక్తి పథకం కింద అనకాపల్లి జిల్లాలో గల నర్సీపట్నం, అనకాపల్లి డిపోల నుంచి నడుస్తున్న బస్సుల్లో నెల రోజుల్లో 14,86,513 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి వి.ప్రవీణ తెలిపారు. ఈ మేరకు మహిళలు రూ.5.35 కోట్ల మేర లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగిందన్నారు. అనకాపల్లి డిపోలో 100% ఓఆర్ నమోదు అయిందన్నారు.

News September 17, 2025

ADB: తెలంగాణకు అండ.. కొండా లక్ష్మణ్

image

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. ASF(D)లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆది గురువుగా నిలిచారు. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించడమే కాక.. టీఆర్ఎస్ ఆవిర్భావంలోనూ కీలకంగా వ్యవహరించారు. 96 ఏళ్లప్పుడూ స్వరాష్ట్రం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు.

News September 17, 2025

ADB: ‘చేయి’ కలుపుతారా.. కలిసి పనిచేస్తారా?

image

ADB జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంజీవరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ ప్రధానకార్యదర్శి గండ్రత్ సుజాత పార్టీలో చేరడంతో ఓ వర్గం అసంతృప్తిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పనిచేస్తారా..? కలిస్తే లోకల్ పోరులో వీరి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.