News January 30, 2025
MBNR: తల్లి మృతి.. తల్లడిల్లిన పిల్లలు

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
Similar News
News January 19, 2026
వరంగల్: ఇక పట్టణాల్లో ఇందిరమ్మ చీరలు..!

గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేసింది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణాల్లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది. జిల్లాలో వర్ధన్నపేట, నర్సంపేట మునిసిపాలిటీలు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యేలు చీరలను పంపిణీ చేయడానికి గాను సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ వెలువడక ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని నేతలు భావిస్తున్నారు.
News January 19, 2026
సంతానలేమిని నివారించే ఖర్జూరం

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.
News January 19, 2026
ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్.. కాకినాడలో రికార్డు

కాకినాడలో రూ.83 వేల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఏటా 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ను పర్యావరణ పరిరక్షణలో అగ్రగామిగా నిలపనుంది. తొలి దశలో 1 మిలియన్ టన్నుల ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. పునరుత్పాదక విద్యుత్ను వినియోగించే ఈ ప్లాంట్ ద్వారా లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గనున్నాయి.


