News January 30, 2025

వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

image

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్‌కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్‌పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం.

Similar News

News January 11, 2026

నిజామాబాద్: మందు బాబులపై ఉక్కుపాదం..!

image

NZB జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 5 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 232 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రూ. 22.40 లక్షల జరిమానా విధించింది. వీరిలో 6గురికి జైలు శిక్ష పడింది. ‘ఒక్కసారి దొరికితే రూ.10 వేల జరిమానా’ తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం, పండుగ వేళల్లో విందులు చేసుకునే వారు వాహనాలు నడపరాదని పోలీసులు సూచిస్తున్నారు.

News January 11, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

image

సంక్రాంతి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి ధీరజ్ ఒక ప్రకటనలో కోరారు. పండగ ఆఫర్లు, ఉచిత గిఫ్టులు, భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేస్తే భారీగా నష్టపోవడం ఖాయమన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు.

News January 11, 2026

తాగునీటి భద్రతకు బల్దియాలో ‘వాటర్ రింగ్ మెయిన్’

image

బల్దియా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా జలమండలి భారీ కసరత్తు మొదలుపెట్టింది. రూ.7,200CRతో 158KM ‘వాటర్ రింగ్ మెయిన్’కు రూపకల్పన చేసింది. నగరం చుట్టూ జలవలయంగా పైపులైన్ ఏర్పాటు చేసి గోదావరి, కృష్ణా, మంజీరా, ఉస్మాన్, హిమాయత్‌సాగర్ వనరులను క్లోజ్డ్ లూప్ విధానంలో అనుసంధానించనుంది. 18KM పనులు పూర్తవగా, మిగిలిన పనులకు DPRతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. నగర భవిష్యత్ నీటి అవసరాలకు ఇది కీలకం కానుంది.