News January 30, 2025

వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

image

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్‌కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్‌పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం.

Similar News

News January 9, 2026

సంగారెడ్డి: ఉచిత శిక్షణకు రేపే చివరి తేదీ

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో IELTS(అంతర్జాతీయ స్కాలర్షిప్) కోసం ఉచిత శిక్షణా దరఖాస్తులు ఈ నెల 10వ తేదీ వరకు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను www.bcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 9, 2026

విజయవాడలో ముగ్గురు హెడ్ కానిస్టేబుల్‌లకు ఉద్యోగోన్నతి

image

విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు హెడ్ కానిస్టేబుల్‌లకు సర్వీసు ప్రతిపాదన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించి సీపీ రాజశేఖర్ బాబు బదిలీ చేశారు. ఏఎస్ఐలు ఏలేశ్వరం మెహర్ బాబు, ఉమామహేశ్వరరావు, మురళీకృష్ణ ఈ సందర్భంగా సీపీను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ అభినందనలు తెలిపారు.

News January 9, 2026

నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం: చంద్రబాబు

image

AP: ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. అప్పుడూ మమ్మల్ని ఇలాగే విమర్శించారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.