News January 30, 2025

అత్యుత్తమ పోలీసులున్న రాష్ట్రమేదంటే?

image

భారతదేశంలో బెస్ట్ పోలీసింగ్‌ను అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2022 ప్రకారం ఇతర రాష్ట్రాలు ఫాలో అయ్యేలా తీసుకుంటున్న నిర్ణయాలు, అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులు, పౌర-స్నేహపూర్వక కార్యక్రమాలు, ఆధునికీకరణ, పారదర్శకతను బేస్ చేసుకొని ర్యాంకులిచ్చారు. రెండో స్థానంలో కర్ణాటక, మూడు ఆంధ్రప్రదేశ్, నాలుగు ఒడిశా ఉన్నాయి. 2024 డేటా ఇంకా విడుదల కాలేదు.

Similar News

News November 16, 2025

తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

తిరుపతి బ్లిస్ హోటల్ పక్కన ఉన్న రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రుయా మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.

News November 16, 2025

శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.

News November 16, 2025

‘ఇలా దీపం వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి’

image

రావి ఆకుపై ప్రమిదను ఉంచి, అందులో నువ్వుల నూనె పోసి, దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే.. పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘రావి చెట్టు ఎంతో పవిత్రమైనది. దీన్ని పూజిస్తే శాపాలు, దోషాలు, గత జన్మ కర్మలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు కలగడానికి ఈ దీపం పెట్టాలి’ అని సూచిస్తున్నారు.