News January 30, 2025
స్కోర్ 600.. ముగ్గురు సెంచరీలు

శ్రీలంకపై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి టెస్టులో రెండో రోజు ఆసీస్ స్కోర్ 600కు చేరింది. ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేశారు. వీరిలో ఖవాజా(232) డబుల్ సెంచరీ చేయగా స్మిత్(141), ఇంగ్లిస్(102) శతకాలు బాదారు. శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉంచాలని ఆసీస్ 4.2 రన్రేట్తో ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరుతో స్మిత్ ఈ సిరీస్కు సారథిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం AUS స్కోర్ 600/5.
Similar News
News October 31, 2025
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్పేట్-1, రహమత్ నగర్, 5న షేక్పేట్-2, యూసుఫ్గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.
News October 31, 2025
IND, AUS మ్యాచులో నమోదైన రికార్డులు

* ఉమెన్స్ ODIsలో హైయెస్ట్ రన్ ఛేజ్ ఇదే(339)
* WC నాకౌట్ మ్యాచులో ఇదే ఫస్ట్ 300+ రన్ ఛేజ్
* ఉమెన్స్ ODI WC ఫైనల్కు భారత్ రావడం ఇది మూడోసారి. 2005, 2017లో రన్నరప్గా నిలిచింది
* WCలో AUS వరుస విజయాలకు(15M తర్వాత) బ్రేక్
* WC నాకౌట్ మ్యాచుల్లో ఛేజింగ్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా జెమీమా
* ఉమెన్స్ వన్డేల్లో 2 ఇన్నింగ్స్లు కలిపి ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్-679
News October 31, 2025
బాహుబలి యూనివర్స్లో కొత్త సినిమా ప్రకటన

బాహుబలి యూనివర్స్లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.


