News January 30, 2025

పార్వతీపురం అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరి

image

పార్వతీపురం అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరీ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన డాక్టర్ దిలీప్ కిరణ్ ఏసీబీకి బదిలీపై వెళ్లనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన నుంచి నేటి వరకు అదనపు ఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

Similar News

News March 3, 2026

విజయవాడ: యువతకు మంచి అవకాశం.. 3 నెలల ఫ్రీ ట్రైనింగ్

image

SRR & CVR ప్రభుత్వ కళాశాలలోని స్కిల్ హబ్‌లో అప్లికేషన్ డెవలపర్(వెబ్ & మొబైల్) కోర్సులో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా స్కిల్ అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. 20 నుంచి 35 ఏళ్లలోపు వయస్సున్న డిప్లొమా/బీటెక్/డిగ్రీ /పీజీ/ అభ్యర్థులు ఈ శిక్షణలో చేరవచ్చని, ప్రవేశాలకై మార్చి 5లోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకై కళాశాలలోని స్కిల్ హబ్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

News March 3, 2026

TGNPDCL పరిధిలో రికార్డు విద్యుత్ డిమాండ్

image

తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో మంగళవారం 6,441 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. సోమవారం నమోదైన 6,273 మెగావాట్ల రికార్డును అధిగమించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. డిమాండ్ పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని, వేసవిని ఎదుర్కొనేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు.

News March 3, 2026

‘HANUMAN ప్రాజెక్ట్’ లక్ష్యం ఇదే..

image

AP: మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను నివారించడమే ‘HANUMAN ప్రాజెక్ట్’ ఉద్దేశమని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషులు, వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్న వన్యప్రాణులను ఎలా హ్యాండిల్ చేయాలనే ఆలోచనతోనే దీన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం, సరిహద్దు గ్రామాల ప్రజల ఉపాధిని కాపాడడమే ఈ ప్రాజెక్టు కర్తవ్యమన్నారు. సంఘర్షణ జరిగినప్పుడు వెంటనే స్పందించి ఉపశమన చర్యలను చేపడతామన్నారు.