News January 30, 2025
GHMC వార్షిక బడ్జెట్కు అమోదం

GHMC కౌన్సిల్ సమావేశంలో వార్షిక బడ్జెట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాల్లో చర్చలేకుండానే 2025-26 వార్షిక బడ్జెట్ను ఆమోదించారు. అంతకుముందు ఆఫీస్లో హైడ్రామా నెలకొంది. భిక్షాటన చేస్తూ BJP కార్పొరేటర్లు, పోడియం వద్ద BRS కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి సభ్యులను అరెస్ట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల నడుమ రూ. 8,440 కోట్ల వార్షిక బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
Similar News
News November 9, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈనెల 14,15వ తేదీల్లో జరగనున్న ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతారన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News November 9, 2025
రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీకి షాకింగ్ కలెక్షన్లు

రష్మిక లీడ్ రోల్లో నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశించినస్థాయిలో రావట్లేదు. తొలి రోజు తెలుగు, హిందీలో ₹1.30 కోట్లు, రెండో రోజు ₹2.50 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు Sacnilk వెల్లడించింది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బుక్ మై షోలో D1 34K టికెట్లు అమ్ముడవగా, D2 68Kకు పెరిగినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.
News November 9, 2025
5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్స్.. 81 మంది అరెస్ట్

TG: సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. AP, TN, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆపరేషన్ చేపట్టి 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరిపై 754 కేసులున్నాయని, రూ.95 కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్లు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల ఖాతాల్లోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశామన్నారు.


