News January 30, 2025

విశాఖ జిల్లాలో ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 23 బృందాలు

image

విశాఖ జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లుకు చర్య‌లు తీసుకున్నామ‌ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. వివిధ స్థాయి అధికారుల‌తో కూడిన‌ 12 ఎంసీసీ బృందాల‌ను నియ‌మించామ‌న్నారు. మండ‌లానికి ఒక‌టి చొప్పున‌ 11ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. జీవీఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్, జ‌డ్పీ సీఈవో, భీమిలి, విశాఖ‌ ఆర్డీవోల‌ను నోడ‌ల్ అధికారులుగా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు.

Similar News

News November 7, 2025

విశాఖను డ్రగ్స్‌కు అడ్డగా మార్చారు: పట్టభి రామ్

image

విశాఖ డ్రగ్స్ కేసులో YCP విద్యార్థి నాయకుడు కొండా రెడ్డి అరెస్టుతో రాజకీయాలు వేడెక్కాయి. TDP నేత పట్టాభి రామ్ గురువారం మాట్లాడుతూ .. ‘YCP యువజన విభాగం డ్రగ్స్ ముఠాగా మారింది. జగన్ హయాంలో విశాఖను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారు’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘కొండా రెడ్డి అరెస్టు అక్రమం. ప్రభుత్వం కక్షతో YCP నేతలను టార్గెట్ చేస్తోంది’ అని ఆరోపించారు.

News November 7, 2025

విశాఖ: ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన సీతమ్మధారకు చెందిన కనపర్తి వీరేందర్, గ్రీన్ గార్డెన్‌కు చెందిన జాగు సత్యనారాయణకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటివరకు 90 మందికి రూ.72 లక్షల పరిహారం అందించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.

News November 7, 2025

రూ.10 లక్షల కోట్ల ఒప్పందాలు.. 7.30 లక్షల ఉద్యోగుల కల్పన

image

రాష్ట ప్రభుత్వం ఈ నెల 14, 15న నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసి పది లక్షల కోట్ల ఒప్పందాలు, 7.30 లక్షల ఉద్యోగుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. GVMC ప్రధాన కార్యాలయంలో సదస్సుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. జీరో వేస్ట్ కాన్సెప్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కే బాటిల్స్ వినియోగిస్తున్నామన్నారు.