News January 30, 2025
దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం: హరీశ్ రావు

PG మెడికల్ సీట్లలో 50% లోకల్ రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2025కి తెలంగాణలో 2924 PG సీట్లు ఉండగా, 50% లోకల్ రిజర్వేషన్ ప్రకారం 1462 సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకే దక్కేవన్నారు. అయితే తాజా తీర్పుతో ఈ సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లిపోతాయన్నారు.
Similar News
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News March 14, 2025
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.