News January 30, 2025
వరంగల్ మార్కెట్లో అరుదైన మిర్చి ఉత్పత్తులు రాక

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు నేడు వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12వేలు, డబ్బి బ్యాగడి మిర్చి రూ.18,500, నం.5 మిర్చి ధర రూ.13,500 పలికాయి. అలాగే 2043 మిర్చి రూ.13వేలు, 5531 మిర్చి రూ.11,200, 2043 మిర్చి రూ.14వేలు, 273 రకం మిర్చి రూ.12వేలు, 334 మిర్చి రూ.11,500, ఎల్లో మిర్చి రూ.16,500 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News February 23, 2025
బండి సంజయ్ కుమార్కు ఘన స్వాగతం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు కొత్తవాడలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి, నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పని చేయాలని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
News February 23, 2025
కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన అన్ని పీజీ కోర్సులకు(రెగ్యులర్, సప్లిమెంటరీ) సంబంధించిన మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3, 5, 7, 10, 12, 15 తేదీల్లో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News February 23, 2025
నేడు వరంగల్ జిల్లాకు బండి సంజయ్

నేడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జిల్లాకు రానున్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ తెలిపారు. ఉ.11 గంటల 30 నిమిషాలకు బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించనున్నారు.