News January 30, 2025
భద్రాచలంలో 82 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం చెక్పోస్ట్ వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్న నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు కారులో సుమారు 81.950 కేజీల ఎండు గంజాయిని గుర్తించారు. కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, గంజాయి, కారును భద్రాచలం పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించారు.
Similar News
News July 7, 2025
రంప : 9000మంది విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్

రంపచోడవరం, చింతూరు డివిజన్లో 21 గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్ను ప్రభుత్వం మంజూరు చేసిందని ITDA. PO. సింహాచలం సోమవారం ప్రకటనలో తెలిపారు. దాదాపు 9 వేల మంది బాల, బాలికలకు వీటిని అందజేస్తామన్నారు. డిటర్జెంట్ సోప్స్, పౌడర్, బాత్ సోప్స్, షాంపు పాకెట్స్, కోకోనట్ ఆయిల్, వేజలైన్, టూత్ పేస్ట్, బ్రష్ తదితర వస్తువులు ఉంటాయని తెలిపారు.
News July 7, 2025
ముల్డర్ సరికొత్త చరిత్ర

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.
News July 7, 2025
2047 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తాం: మంత్రి కందుల

ఆంధ్రప్రదేశ్ విజన్ యాక్షన్ ప్లాన్-2047లో భాగంగా ఉపాధి, సాంఘిక గౌరవం, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రూపొందించిన P-4 కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలులో మంత్రి మాట్లాడారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో P-4 రూపొందించినట్లు చెప్పారు.