News January 30, 2025
వరంగల్ పోలీస్ కమిషరేట్ అధికారులతో సమావేశం అయిన అడిషనల్ డీజీపీ

వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వచ్చిన అడిషనల్ డీజీపీ స్వాతి లాక్రా వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. కాగా, ముందుగా వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ విభాగం పనీతీరును, శాంతి భద్రత నియంత్రణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అడిషినల్ డీజీపీ వివరించారు.
Similar News
News July 7, 2025
నిజాంపేట్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

నిజాంపేట్ మండలానికి చెందిన గంగరబోయిన అంజమ్మ(45) ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిజాంపేట్ నుంచి హైదరాబాద్కు బైక్పై వెళ్తుండగా అల్లాదుర్గ్ శివారులో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు ఆమెను జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News July 7, 2025
అప్పట్లో ఆశా పేరు చెబితే నోరు ఊరేది!!

ఇవాళ <<16972254>>చాక్లెట్<<>> అంటే కోకొల్లల పేర్లు, రుచులు. కానీ రీల్ను 20 ఏళ్లు వెనక్కి తిప్పితే ఆశా పేరుతో లిస్ట్ ఆరంభం. ఆశా, మ్యాంగో బైట్, కాఫీ బైట్, న్యూట్రిన్, ఆల్పెన్లిబి, చింతపండు చాక్లెట్ వంటివే ట్రెండ్. నిజానికి వీటిలో చాలా వరకు క్యాండీలు, టాఫీలు.. కానీ అప్పుడవే మన చాక్లెట్స్. అవి నోటిని తాకితే వచ్చే ఫీల్, కొనేందుకు డబ్బుల కోసం ఇంట్లో మన పోరాటం నేటికీ ఓ స్వీట్ మెమొరీ. మీ ఫెవరెట్ చాక్లెట్ ఏది? కామెంట్.
News July 7, 2025
ఇంజినీరింగ్ సీట్ల భర్తీపై ఉమ్మడి గుంటూరులో ఆసక్తి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్కు 33,063 మంది హాజరైన వారిలో 23,536 మంది అర్హత సాధించారు. జిల్లాలోని రెండు ప్రభుత్వ యూనివర్సిటీలు (ANUతోపాటు JNTU నరసరావుపేట) సహా 34 ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 32,240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదివారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 22న సీట్లు కేటాయించనున్నారు. అయితే అభ్యర్థుల కంటే సీట్లు ఎక్కువగా ఉన్నాయి.