News January 30, 2025

సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నా: DGP

image

AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని DGP ద్వారకా తిరుమలరావు అన్నారు. తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నట్లు చెప్పారు. 7 నెలలుగా DGPగా పని చేస్తున్నానని, 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించానని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై 9.5% నేరాలు తగ్గినట్లు వివరించారు. సైబర్ క్రైమ్స్ తప్ప మిగతావన్నీ కంట్రోల్‌లోనే ఉన్నాయన్నారు. రేపు ఆయన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.

Similar News

News October 18, 2025

బుధవారం నుంచి భారీ వర్షాలు: APSDMA

image

AP: మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

News October 18, 2025

పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధానా!

image

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇటీవల స్మృతి గురించి అడిగిన ప్రశ్నకు పలాష్ ముచ్చల్ స్పందిస్తూ ‘స్మృతి మంధానా త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’ అని వెల్లడించారు. వీరిద్దరూ గత 6 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

News October 18, 2025

జగన్ విషప్రచారాన్ని అడ్డుకోవాలి: సీఎం

image

AP: ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మంత్రులతో పాటు పార్టీ నేతలపైనా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రులు మాట్లాడారు కదా.. మాకెందుకులే అనుకుంటే సరిపోదని స్పష్టం చేశారు. మీడియా సమావేశాలు పెట్టి జగన్ అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.