News January 30, 2025
ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 15, 2025
కడప ఎంపీ.. హాజరులో చివరి స్థానం

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరులో 54.41 శాతంతో చివరి స్థానంలో ఉన్నారు. 80 ప్రశ్నలను సభలో అడిగగా.. 5 చర్చల్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు.
News September 15, 2025
పవర్గ్రిడ్లో 866 అప్రంటిస్లు.. AP, TGలో ఎన్నంటే?

పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 866 అప్రంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. అక్టోబర్ 6లోగా powergrid.in సైట్లో అప్లై చేసుకోవచ్చు.
News September 15, 2025
ధర్మవరం మహిళ హత్య కేసులో భర్త అరెస్ట్

ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సాకే సరస్వతి అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో భర్త వెంకటరాముడు హత్య చేశాడని టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఆయన వివరాల మేరకు.. రెండు నెలల క్రితం సరస్వతిని ఆమె భర్త వెంకటరాముడు బంధువులతో కలిసి హత్య చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్ల పల్లి వంక పక్కన శవాన్ని పూడ్చిపెట్టారు. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు.