News January 30, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యంశాలు

image

✓ జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు.✓ కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ నారాయణరెడ్డి.✓ కొడంగల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.✓ దుద్యాల మండలంలో నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభం.✓ ప్రభుత్వం హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీజీకి వినతి పత్రాలు.✓ కొడంగల్‌లో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్‌కు పోలీసుల గౌరవ వందనం. 

Similar News

News November 4, 2025

ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

image

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్‌లు, సబ్‌మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్‌యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.

News November 4, 2025

మన్యం కేఫ్ పరిశీలించిన DRDA పీడీ

image

పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ ఆవరణలో DRDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మన్యం కేఫ్‌ను DRDA పీడీ ఎం.సుధారాణి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మకాలను పరిశీలించారు. మన్యం జిల్లా మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఈ కేఫ్ ద్వారా అమ్మకాలు చేపడుతున్నామని, ప్రజలు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు.

News November 4, 2025

‘వరద ముంపు నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి’

image

గ్రేటర్ వరంగల్‌కు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్య శారద, స్నేహ శబరీష్, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో వరద ముంపు నివారణపై సమీక్ష నిర్వహించి, సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.