News January 31, 2025

KMR: నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్

image

రాబోయే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తాగునీటి వేసవి ప్రణాళిక పై గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నుంచి మండల ప్రత్యేక అధికారులు మండల కేంద్రాలను సందర్శించి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి నీటి సరఫరా పరిస్థితిని అంచనా వేయాలన్నారు.

Similar News

News July 6, 2025

సత్తెనపల్లి భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ఆత్మహత్య

image

సత్తెనపల్లిలోని భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆయన మృతదేహాన్ని కృష్ణా నది నుంచి వెలికి తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా.? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2025

గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపునకు ఏర్పాట్లు?

image

నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్. రోజు రోజుకు రద్దీ పెరుగుతుండడంతో ఇరుకుగా మారుతోంది. ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో మార్కెట్‌ను నగర శివారుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయల అన్నిటికి వేదికగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 150 ఎకరాల స్థలం అవసరం ఉందని అంచనా వేసిన అధికారులు భూముల లభ్యతను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

News July 6, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కలెక్టరేట్‌లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో, MRO కార్యాలయాల్లో అర్జీలను ఇవ్వవచ్చని ఆయన తెలిపారు.