News January 31, 2025
హైదరాబాద్ చరిత్రలో నేడు కీలకం!

హైదరాబాద్ అభివృద్ధిలో నేడు కీలకం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. గోషామహల్లో ఉదయం 11.40 గంటలకు CM రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో గోషామహల్లోని పోలీస్ గ్రౌండ్స్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు.
Similar News
News January 30, 2026
GNT: ఏవండోయ్ VC గారూ.. వర్సిటీకి ఎప్పుడొస్తారో?

ANU నూతన వీసీగా సత్యనారాయణ రాజును ప్రభుత్వం నియమించినప్పటికీ, ఇప్పటివరకు ఆయన బాధ్యతలు స్వీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత 17 నెలలుగా తాత్కాలిక పాలనతో అస్తవ్యస్తంగా ఉన్న ANUకు నిజంగా నూతనంగా నియమితులైన వీసీ వస్తారా? లేక మరో వ్యక్తిని నియమించనున్నారా? అన్న సందేహం క్యాంపస్లో పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. మంత్రి లోకేశ్ ఈ సమస్యపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
News January 30, 2026
నెల్లూరు: ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష

సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు హైవే క్రాస్ రోడ్డు వద్ద 2018 సెప్టెంబర్ 10న పోలీసులు తనిఖీలు చేస్తుండగా 200KGల గంజాయి పట్టుబడింది. తమిళనాడు(ST) సేలం జిల్లా పెదనాయకంపాళేనికి చెందిన మహదేవన్, వెంకటేశ్ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున ఇద్దరికి జరిమానాను విధిస్తూ నెల్లూరు ఫస్ట్ ఆడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గీత గురువారం తీర్పు చెప్పారు.
News January 30, 2026
శ్రీకాకుళం: రథసప్తమి దర్శనాల్లో నకిలీ పాసులు..నిజమెంత

శ్రీకాకుళం పట్టణంలో అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి సంబంధించిన పాసులు నకిలీవి ముద్రించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వీఐపీ పాసులు, రూ.500 క్షీరాభిషేక టికెట్లు నకిలీ ముద్రణ జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు పోలీసులు జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలలో సోదాలు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


