News January 31, 2025

NRPT: మెడికల్ కలశాలను సందర్శించిన కలెక్టర్

image

నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద ఉన్న మెడికల్ కలశాలను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. కాలేజీలోని వివిధ విభాగాలను, కళాశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తేవాలని సూచించారు. కాలేజీకి మంచి పేరు వచ్చేలా ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్ కిషన్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News July 7, 2025

మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టులో మార్పులు

image

లార్డ్స్‌లో ఈనెల 10 నుంచి భారత్‌తో జరిగే మూడో టెస్టుకు ఇంగ్లండ్ 16 మందితో జట్టును ప్రకటించింది. పేసర్ అట్కిన్సన్ స్క్వాడ్‌లోకి వచ్చారు. ఈ మ్యాచులో ENG 3 మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. ఆర్చర్, అట్కిన్సన్‌, బెథెల్ తుది జట్టులో ఆడే ఛాన్సుందని ICC అంచనా వేసింది.
టీమ్: స్టోక్స్(C), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బెథెల్, రూట్, పోప్, స్మిత్, ఓవర్టన్, బ్రూక్, కుక్, కార్స్, క్రాలీ, డకెట్, టంగ్, వోక్స్

News July 7, 2025

జగిత్యాల జిల్లాలో 66 మంది ఎంపిక

image

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.

News July 7, 2025

నల్గొండ జిల్లాలో 5వేలకు పైగానే రేషన్ కార్డులు కట్!

image

జిల్లాలో రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరుసగా ఆరు నెలలపాటు బియ్యం తీసుకొని కార్డులు రద్దు కానున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం 4,78,216 రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా జిల్లాలో 5,092 కార్డుదారులు ఆరు మాసాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేల్చి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించి కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.