News January 31, 2025

విద్యార్థులు మనసుపెట్టి చదువుకోవాలి: DEO

image

విద్యార్థులు మనసుపెట్టి చదువుకొని చదువులో జీవించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ హైస్కూల్ లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులను ఏర్పాటు చేశారు. మార్చి 21న పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని, ప్రతి విద్యార్థి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. ఎంఈఓ ధనుంజయ, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మణ్, ఎస్సై ప్రవీణ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News January 12, 2026

జాతీయస్థాయికి 11 మంది మెదక్ క్రీడాకారులు

image

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.

News January 12, 2026

MDK: పోలీసుల అప్రమత్తతతో తప్పిన విషాద ఘటన

image

ఏడుపాయల వనదుర్గామాత ఆలయం సమీపంలోని ఘనపూర్ ఆనకట్ట వద్ద కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్యను QRT-1 టీమ్ ప్రాణాలకు తెగించి కాపాడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న QRT-1 సిబ్బంది ఏఆర్‌ ఎస్‌ఐలు శ్రీనివాస్, సాయిలు తదితరులు నది ప్రవాహంలోకి వెళ్లి తాడు సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారి ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసించారు.

News January 12, 2026

మెదక్‌: పేకాట, కోడిపందాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వాహన తనిఖీలు, రాత్రి, పగలు గస్తీ ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.