News March 18, 2024
ప్రియుడి కోసం తండ్రి, తమ్ముడిని చంపేసింది!
మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి ఓ 15 ఏళ్ల బాలిక తండ్రిని (52), సోదరుడిని (8) చంపేసింది. మొదట బాలికపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇంట్లో సోదా చేయగా ఫ్రిజ్లో మృతదేహాలు లభించాయి. ఆమె ఓ 19ఏళ్ల యువకుడితో పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అతడు గత ఏడాది పోక్సో చట్టం కింద శిక్ష అనుభవించి బెయిల్పై విడుదల కావడం గమనార్హం.
Similar News
News September 30, 2024
ALERT.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
☞ ICICI డెబిట్ కార్డుతో గత త్రైమాసికంలో రూ.10000 వాడితే ప్రస్తుత త్రైమాసికంలో 2 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్టు లాంజ్ యాక్సెస్లు పొందవచ్చు
☞ HDFC క్రెడిట్ కార్డుతో ఒక త్రైమాసికంలో ఒక యాపిల్ ఉత్పత్తిపైనే రివార్డు రిడీమ్ చేసుకోవచ్చు
☞ పన్ను రిటర్నుల్లో ఇకపై ఆధార్ నంబర్ మాత్రమే వాడాలి
☞ F&O ట్రేడింగ్లో ఆప్షన్ కాంట్రాక్టును విక్రయిస్తే ప్రీమియంపై STTని 0.1%, ఫ్యూచర్స్ విభాగంలో STT 0.02% చెల్లించాలి.
News September 30, 2024
ఇసుక రవాణా ఛార్జీల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి కొల్లు
APలో ఇసుక సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదనే NGT నిబంధనల ప్రకారం రీచుల్ని నిలిపివేశామని చెప్పారు. ఇకపై బోట్ మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపడతామన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
News September 30, 2024
నాలుగో రోజు ముగిసిన ఆట
భారత్-బంగ్లా రెండో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 26 రన్స్ చేసింది. అశ్విన్కే 2 వికెట్లు పడ్డాయి. బంగ్లా మరో 26 రన్స్ వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285/9 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా 233 రన్స్కు ఆలౌటైంది.