News January 31, 2025

పార్వతీపురం: ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పిజి.ఆర్.ఎస్ నిలుపుదల

image

జిల్లాలో శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిలుపుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఫిబ్రవరి, 27వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చి, 3వ తేదీన జరుగుతుందన్నారు.

Similar News

News November 7, 2025

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

News November 7, 2025

వరంగల్ సీపీ కార్యాలయంలో వందేమాతరం గేయాలాపన

image

వందేమాతరం జాతీయ గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది వందే మాతరం గేయాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్‌తో పాటు ఏఓ, ఏసీపీలు, ఆర్ఎస్ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పరిపాలన, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News November 7, 2025

ఇంకొల్లు: సినీ ఫక్కీలో దొంగతనం

image

సినీ ఫక్కీలో దొంగతనం జరిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిలంకూరి కాంతయ్య బంగారు నగలు విడిపించుకునేందుకు రూ.3.90 లక్షలతో బ్యాంకుకు వెళ్లాడు. వడ్డీ కింద మరో 10 వేల కోసం ఇంటికి బయలుదేరగా దుండగులు బైక్‌పై వచ్చి రూ.200ల నోటు కింద పడేశారు. కాంతయ్యను మభ్యపెట్టి, సైకిల్‌పై ఉన్న నగదుతో పారిపోయారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.