News January 31, 2025
ఫిబ్రవరి 15న దుబాయ్కు టీమ్ ఇండియా

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా వచ్చే నెల 15న దుబాయ్ పయనం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లేదా యూఏఈతో వార్మప్ మ్యాచ్ ఆడుతుందని సమాచారం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. 23న చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
Similar News
News July 6, 2025
కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి: హరీశ్ రావు

TG: పదేళ్ల KCR పాలనలో రైతు ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో తగ్గాయని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా 2015-2022 మధ్య నమోదైన రైతు ఆత్మహత్యల డేటాను ఆయన షేర్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2015లో 11.1% ఉండగా 2022 నాటికి 1.57%కి తగ్గినట్లు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంతో పలు కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్నారు.
News July 6, 2025
4 బంతుల్లో 3 వికెట్లు

మేజర్ లీగ్ క్రికెట్లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.
News July 6, 2025
‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: డైరెక్టర్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ధనుష్తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు. గత ఏడాది OCTలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ₹100crకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.