News January 31, 2025
MNCL: 10వ తరగతి పరీక్షలలో జిల్లా మెరవాలి: కలెక్టర్

10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ఉన్నతస్థానంలో నిలపాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రేరణ అవగాహన తరగతుల్లో ఆయన మాట్లాడారు. పరీక్షలకు 50రోజుల సమయమే ఉన్నందున ఏకాగ్రతతో చదవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధించేలా పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News January 11, 2026
కాంగ్రెస్తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

ఈ సారి తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకోనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. హస్తం పార్టీ సీట్ల షేరింగ్ ప్రపోజల్ను స్టాలిన్ తిరస్కరించినట్లు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం ఉండబోదన్న DMK నేత, మంత్రి పెరియస్వామి మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు హీరో విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
News January 11, 2026
మైలురాళ్ల రంగుల గురించి తెలుసా?

*పసుపు: నేషనల్ హైవేలను సూచిస్తుంది. రాష్ట్రాలు, ప్రధాన నగరాలను కలిపే ఈ రోడ్లను NHAI మెయింటెన్ చేస్తుంది.
*గ్రీన్: ఇది స్టేట్ హైవేను సూచిస్తుంది. ఒక రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను కనెక్ట్ చేస్తుంది.
*బ్లాక్: సిటీ, జిల్లా రోడ్లను సూచిస్తుంది. అర్బన్ సెంటర్లు, మున్సిపాలిటీలను కలుపుతుంది.
*ఆరెంజ్: గ్రామాల రోడ్లను సూచిస్తుంది. PMGSY స్కీమ్ ద్వారా వీటిని అభివృద్ధి చేస్తారు.
News January 11, 2026
KNR: కంటైనర్ బోల్తా.. రైతు స్పాట్డెడ్

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో స్థానిక రైతు రాణవేని హనుమంతు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి పేపర్ లోడుతో వెళ్తున్న కంటైనర్, అండర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు విస్తరణ పనుల వద్ద ఈ ప్రమాదం జరగగా, అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న హనుమంతుపై కంటైనర్ పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


