News January 31, 2025
ఆదిలాబాద్: వన్ టౌన్లో అట్రాసిటీ కేసు నమోదు

ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. CI సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మోచిగల్లికి చెందిన బాలశంకర్ కృష్ణను సామల ప్రశాంత్ అనే వ్యక్తి ఈనెల 12న వివేకానంద చౌక్లో కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI పేర్కొన్నారు
Similar News
News December 30, 2025
ఆదిలాబాద్: చైనా మంజా.. 5 కేసులు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో చైనా మంజాపై పూర్తిగా నిషేధం విధించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా, దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు వన్ టౌన్లో 5 కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా చైనా మంజా విక్రయిస్తే సమాచారం అందించాలని కోరారు.
News December 30, 2025
ఆదిలాబాద్: 2025లో పోలీసుల అద్భుత ఫలితాలు

2025లో పోలీసులు అద్భుత ఫలితాలు సాధించారు. గతేడాది 20గా ఉన్న నేరస్తుల శిక్షల సంఖ్య ఈసారి 51కి పెరిగింది. CEIR ద్వారా 718 ఫోన్లను రికవరీ చేశారు. షీ టీమ్స్, పోలీస్ అక్క కార్యక్రమాలతో మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. డ్రగ్స్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం, ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడమని ఎస్పీ వెల్లడించారు.
News December 29, 2025
38 ఫిర్యాదులు నమోదు: ADB ఎస్పీ

సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 38 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయనతో పాటు శిక్షణ ఐపీఎస్ రాహుల్ పంత్, సీసీ కొండరాజు, కవిత, వామన్ ఉన్నారు.


