News January 31, 2025

సిద్దిపేట: రోడ్డు భద్రత అందరి బాధ్యత: శంకర్ నారాయణ

image

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సిద్దిపేట రవాణాశాఖ అధికారి శంకర్ నారాయణ అన్నారు. పట్టణంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు ఎక్కువ శాతంలో అరికట్టవచ్చని వివరించారు. ఇందులో ఆధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 11, 2025

పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం: చంద్రబాబు

image

AP: పీ4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్నర్షిప్) అమలుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మార్గదర్శకులుగా ఉండేందుకు పారిశ్రామికవేత్తలు, NIRలు వంటివారు 18,332మంది ముందుకొచ్చారు. వారిలో టాప్ 200మందిని ఈనెల 18న డిన్నర్‌లో సీఎం కలవనున్నారు. పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని భాగస్వాములను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని CM తెలిపారు. పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దామని పేర్కొన్నారు.

News July 11, 2025

HYD: జంట జలాశయాల పరిధిలో 4 ఎస్టీపీలు

image

జంట జలాశయాలలోకి మురుగు చేరకుండా నివారించేందుకు కొత్తగా నిర్మిస్తున్న 4 ఎస్టీపీల పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గురువారం పరిశీలించారు. కొత్వాల్‌గూడ ఎస్టీపీ పనులను పరిశీలించిన ఆయన పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి సరిహద్దులు నిర్దేశించాలని సూచించారు. జీవో-11 పరిధిలోలేని ప్రాంతాలను గుర్తించి, 2050 వరకూ మురుగు ఉత్పత్తిని అంచనా వేయాలని తెలిపారు.

News July 11, 2025

ముగిసిన తొలి రోజు ఆట.. ENG స్కోర్ ఎంతంటే?

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ నిలదొక్కుకుంది. మూడో సెషన్ ఆరంభంలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా రూట్ 99*, స్టోక్స్ 39* రన్స్‌తో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 251 రన్స్ చేసింది. భారత బౌలర్లలో నితీశ్ 2, బుమ్రా, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.