News January 31, 2025
విజయవాడ: డ్రోన్లతో ఈవ్ టీజింగ్కు అడ్డుకట్ట

ఆధునిక సాంకేతికత ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు గురువారం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. డ్రోన్లతో స్కూల్స్, కాలేజీ పరిసరాలలో ఈవ్ టీజింగ్ జరగకుండా, బహిరంగ ప్రదేశాలలో మద్యం/ గంజాయి సేవించే వ్యక్తులను గుర్తిస్తున్నామని తెలిపారు. డ్రోన్లతో పహారా కాస్తూ అసాంఘిక కార్యక్రమాలు జరుగు ప్రదేశాలు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Similar News
News July 5, 2025
వరంగల్: అలర్ట్ అయిన ఆర్టీఏ ఏజెంట్లు.. షట్టర్లకు తాళాలు!

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల వార్తలతో వరంగల్ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల్లో ఏజెంట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఏసీబీ అధికారులు తనిఖీలకు వస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగడంతో ఏజెంట్లు షాపుల షట్టర్లకు తాళాలు వేసి ఎక్కడివారక్కడ సైలెంట్ అయ్యారు. ఆర్టీఏ అధికారులతో పాటు ఏజెంట్లు, హోంగార్డులు అక్రమాలకు పాల్పడుతున్నారని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి.
News July 5, 2025
ప్రసిద్ధ్ కృష్ణపై ట్రోల్స్

ఇంగ్లండ్తో రెండో టెస్టులో ఘోరంగా విఫలమైన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై SMలో భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. షార్ట్ పిచ్ బంతులు వేసి జేమీ స్మిత్ సెంచరీకి కారణమయ్యాడని పలువురు విమర్శిస్తున్నారు. ‘ప్రసిద్ధ్ భారత్ వెర్షన్ హారిస్ రవూఫ్’ అని ఒకరు, ‘అతడిని వెంటనే ఇండియాకు పంపండి.. అవసరమైతే టికెట్ నేనే స్పాన్సర్ చేస్తా’ అని మరొకరు, ‘ప్రసిద్ధ్ ఇంగ్లండ్ తరఫున రన్ మెషిన్’ అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు.
News July 5, 2025
కొవ్వూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కొవ్వూరు రైల్వే స్టేషన్ శివారున గుర్తు తెలియని (35) ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ పి.అప్పారావు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల మధ్య సమయంలో రైలు నుంచి జారిపడి మరణించి ఉండొచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, వివరాల కోసం 9347237683 నంబర్ను సంప్రదించాల్సిందిగా కోరారు.