News January 31, 2025

పార్వతీపురం: మార్చి 8 వరకు మీ కోసం కార్యక్రమం రద్దు

image

జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్ కోడ్ జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ముగిసినంత వరకు మీకోసం ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక ) కార్యక్రమం నిలుపుదల చేయనున్నట్లు కలెక్టర్చ జిల్లా ఎన్నికల అధికారి ఎ. శ్యామ్ ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తునట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 20, 2026

NZB: 21, 22 తేదీల్లో ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు: DIEO

image

ఈనెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, 22న 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి (DIEO) తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు కచ్చితంగా చేరుకోవాలని, ప్రతి విద్యార్థి తప్పని సరిగా హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలకు గైర్హాజరైనా వారు ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News January 20, 2026

మన ఆయుష్షు తగ్గించే కొన్ని అపవిత్ర పనులు

image

కొన్ని అలవాట్లు మన ఆయుష్షును తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. దాని ప్రకారం.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవకపోతే స్వచ్ఛమైన గాలి అందక అనారోగ్యం కలుగుతుంది. రాత్రిపూట పెరుగు, దాంతో చేసినవి తింటే వ్యాధులు రావొచ్చు. దక్షిణ, పడమర దిశలో తలపెట్టి నిద్రించడం, శ్మశానంలో మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు వచ్చే విష వాయువు పీల్చడం హానికరం. స్త్రీలు, పిల్లలు, మానవత్వం పట్ల చెడు ఆలోచనలు ఉంటే ఆయుష్షు క్షీణిస్తుంది.

News January 20, 2026

కామారెడ్డి: పదో తరగతి విద్యార్థినులకు ఇస్రో సందర్శన భాగ్యం

image

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులకు ISROను సందర్శించే అవకాశం లభించింది. గత అక్టోబర్ నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపికైన 50 మంది విద్యార్థినులు, వారితో పాటు 30 మంది ఉపాధ్యాయులు ఈనెల 29 ఇస్రో సందర్శనకు వెళ్లనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయం సోమవారం విడుదల చేసింది.