News March 18, 2024

విశాఖ: ‘ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలి’

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహనతో విధులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులను జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు. ఎన్నికల నిర్వాణపై జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన వివిధ మానిటరింగ్ కేంద్రాలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నెరవేర్చాలన్నారు.

Similar News

News January 9, 2026

ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.

News January 9, 2026

ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.

News January 8, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్‌కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్‌లోని ఫ్రెండ్స్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.