News March 18, 2024
దళితబంధుతో ఎదురుదెబ్బ తగిలింది: KCR
TG: ప్రవీణ్ కుమార్ లాంటి నేతలు పార్టీలోకి వస్తే.. స్వార్థపు నాయకుల అవసరం ఉండదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. ‘ఎన్నికల్లో ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు.. గాడిద వెంట పోతేనే గుర్రాల విలువ తెలుస్తది. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మారు. త్వరలోనే వారు నిజాన్ని గ్రహిస్తారు. దళిత బంధు స్కీమ్ ఎదురుదెబ్బ తీయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ పథకంతో లబ్ధి పొందిన కుటుంబాల జీవనం మెరుగైంది’ అని చెప్పారు.
Similar News
News September 30, 2024
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
ప్రయాణికులకు ఆఫర్లు పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. అటు అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. ఛార్జీలు నామ మాత్రంగానే ఉంటాయంది.
News September 30, 2024
ఎల్లుండి రజినీ ‘వేట్టయన్’ ట్రైలర్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ట్రైలర్ అక్టోబర్ 2న రానుంది. లైకా ప్రొడక్షన్స్ తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ రివీల్ పోస్టర్ను విడుదల చేసింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించారు. మంజూ వారియర్ హీరోయిన్గా అలరించనున్నారు. అక్టోబర్ 10న విడుదల కానున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
News September 30, 2024
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు ఊరట
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన ఎలక్టోరల్ బాండ్స్ కేసులో విచారణపై స్టే విధించింది. ఈ కేసులో ఫిర్యాదుదారునిపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని గమనించామని, అలాగే కేసుని దోపిడీకి సంబంధించిన అంశంగా పరిగణించట్లేదని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. అప్పటివరకు ఇన్వెస్టిగేషన్పై స్టే విధించింది.