News January 31, 2025

సంగారెడ్డి: ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

image

గుమ్మడిదల మండలం కానుకుంటకు చెందిన నరేశ్(28) మానసిక పరిస్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మడిదల PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. నరేశ్ ఎంబీఏ పూర్తి చేశాడు. గత 6ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా గురువారం తన ఇంట్లోని బెడ్రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 15, 2025

విశాఖ మెట్రోరైలు నిర్మాణం ఎప్పుడో?

image

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు ఈనెల 12న టెండర్లకు గడువు ముగిసినా ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపకపోవడంతో అక్టోబరు 7వరకు గడువు పొడిగించారు. ప్రాజెక్టు వయబిలిటీపై బిడ్డర్లకు పలు అనుమానాలు ఉండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,250 కోట్లు. మరోవైపు HYD మెట్రోలో ఎదురైన ఇబ్బందులతో ఇకపై మెట్రో ప్రాజెక్టులు చేయమన్న L&Tప్రకటన కూడా ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు.

News September 15, 2025

సంగారెడ్డి: ప్రజా పాలన వేడుకలకు హాజరు కానున్న మంత్రి

image

సంగారెడ్డి పరేడు గ్రౌండ్‌లో ఈనెల 17న నిర్వహించే ప్రజా పాలన వేడుకలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని అన్నారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News September 15, 2025

యునెస్కో జాబితాలోకి మరో 7 ఇండియన్ సైట్స్

image

భారత్‌లోని మరో 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది.
* పంచగని&మహాబలేశ్వర్(MH) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
* ఉడుపి(KN)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
* మేఘాలయన్ ఏజ్ కేవ్స్(తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
* కిఫిర్(నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
* వైజాగ్‌(AP)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
* తిరుపతి(AP)లోని తిరుమల కొండలు
* వర్కల(కేరళ) సహజ వారసత్వం