News January 31, 2025
నేటి నుంచి అరకు ‘చలి’ ఉత్సవాలు ప్రారంభం

AP: అరకు లోయలో నేటి నుంచి చలి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు ఇవి జరగనున్నాయి. ఉత్సవాల కోసం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అధికారులు ముస్తాబు చేశారు. సాయంత్ర వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్ మోటార్ గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. పర్యాటకం పెంపుదలే లక్ష్యంగా వీటిని రాష్ట్రం నిర్వహిస్తోంది.
Similar News
News February 27, 2025
బీఆర్ఎస్ వల్లే SLBC ప్రమాదం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ సరైన సమాయానికి SLBC టన్నెల్ పూర్తి చేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందితే స్పందించని నేతలు.. నేడు పొలిటికల్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. టన్నెల్ విషయాలపై పూర్తిగా అవగాహన 10కి పైగా ఏజెన్సీలు కలిసి ఈ రెస్క్యూ చేపడుతున్నాయని, రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
News February 27, 2025
విశాఖలో కెరీర్ ఫెయిర్.. 10000+ ఉద్యోగాలు

AP: విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్ జరగనుంది. ఏపీ ఉన్నత విద్యామండలి, నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నాస్కామ్ దీనిని నిర్వహిస్తోంది. 49 ఐటీ సంబంధిత కంపెనీల్లో 10,000+ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024, 2025 పాస్అవుట్ అయిన వారు అర్హులు. మార్చి 3లోగా మీ జీమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ <
News February 27, 2025
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించనున్న మోదీ సర్కార్?

కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను తగ్గించాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. వాటా పంపకాలపై సలహాలిచ్చే ఫైనాన్స్ కమిషన్కు ఇప్పటికే విషయం చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం 41గా ఉన్న వాటాను కనీసం 40%కి తగ్గించాలని సూచించినట్టు తెలిసింది. అరవింద్ పణగడియా నాయకత్వంలోని కమిషన్ FY2026-27 రికమెండేషన్స్ రిపోర్టును OCT 31లోపు కేంద్రానికి ఇస్తుంది. ఒక శాతం తగ్గినా కేంద్రానికి రూ.35K CR మిగులుతాయి.