News January 31, 2025

ఎర్రగుంట్ల: కుమారుడికి ఉద్యోగం రాలేదని తండ్రి సూసైడ్

image

ఎర్రగుంట్ల మండలంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిలంకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి కునిషెట్టి వెంకటనారాయణ(50), కృష్ణవేణి భార్యాభర్తలు. చిన్న కుమారుడు Hydలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. పెద్ద కొడుకు లండన్‌లో MS చదివినా, ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపంతో వెంకటనారాయణ యాసిడ్ తాగగా, ప్రొద్దుటూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడని సీఐ నరేశ్ బాబు తెలిపారు.

Similar News

News February 28, 2025

కడప జిల్లాను నాటుసారా రహితంగా మార్చాలి: కలెక్టర్

image

కడప జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని, ఆ దిశగా జిల్లాలో సమూలంగా నాటుసారాను నిర్మూలించాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనా కార్యక్రమం నవోదయం 2.0పై జిల్లా SP అశోక్ కుమార్, DRO విశ్వేశ్వర నాయుడుతో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

News February 27, 2025

బద్వేలు: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

image

బద్వేలుకు చెందిన ఆరు సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల వివరాల మేరకు.. బద్వేలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న మంజుల అనే బాలిక స్పృహ కోల్పోయింది. హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 27, 2025

పొలతలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన SP

image

మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో పొలతల మల్లికార్జునస్వామి వారి ఆలయాన్ని కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సందర్శించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పోలీస్ అధికారులకు బుధవారం రాత్రి పలు సూచనలు చేశారు. ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గాలు, క్యూ లైన్లలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం లోపల భక్తుల ప్రవేశం వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

error: Content is protected !!