News January 31, 2025
KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Similar News
News November 10, 2025
గుర్తింపు కార్డు ఉంటేనే విశ్వవిద్యాలయంలోకి అనుమతి

AUలో భద్రతతో పాటు అనధికారిక వ్యక్తులను నియంత్రణలో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టింది. విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులు, బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విధులు నిర్వహించే సమయంలో ధరించాలని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. గుర్తింపు కార్డులు ధరించని విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులను, విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి అనుమతించబోమన్నారు.
News November 10, 2025
19న మహిళలకు చీరల పంపిణీ

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.
News November 10, 2025
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు సూసైడ్

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మద్యం మానుకోవడంలేదని పెనుకొండ(M) గుట్టూరులో బిహార్కు చెందిన PK రాయ్ భార్య అంజలికుమారి ఉరేసుకుంది. భర్త కియాలో పనిచేస్తాడు. ధర్మవరంలో భవన నిర్మాణ కూలీ శివ(36) మద్యానికి డబ్బులు ఖర్చు చేస్తున్నాడని భార్య నవనీత ప్రశ్నించడంతో ఉరేసుకున్నాడు. మకడశిర(M) మణూరుకు చెందిన మతిస్థిమితం లేని కదురప్ప(46) చెట్టుకు ఉరేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.


