News January 31, 2025
KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Similar News
News November 10, 2025
కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను(చలి తీవ్రతను) అధికారులు వెల్లడించారు. కనిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతలు.. భిక్కనూర్,సర్వాపూర్, వెల్పుగొండ లలో 14.7°C, బీర్కూరు,పుల్కల్, హసన్ పల్లి,బొమ్మన్ దేవిపల్లి లలో 14.8°C, నాగిరెడ్డిపేట,ఇసాయిపేట,రామలక్ష్మణపల్లి,మాచాపూర్ లలో 14.9°C, మేనూర్,దోమకొండ, మాక్దూంపూర్, జుక్కల్ లలో 15°C లుగా రికార్డ్ అయ్యాయి.రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది.
News November 10, 2025
జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 10, 2025
ఊర్కొండ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

మూడు రోజుల నుంచి నాగర్ కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. జిల్లాలోని ఉర్కొండ మండలంలో గడచిన 24 గంటలలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బిజినేపల్లి, వెల్దండ మండలాలలో సైతం 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తిలో 15.4, పదరలో 15.6, ఉప్పునుంతలలో 15.7, తాడూరులో 15.7, అమ్రాబాద్ లో 15.8, నాగర్కర్నూల్లో 15.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


