News January 31, 2025
ఆ పోస్టులకు ఎత్తు నుంచి మినహాయింపు

AP: RTCలో 2016-19 మధ్యకాలంలో చనిపోయిన 16మంది కండక్టర్ల కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల కింద నియమితులవనున్న అభ్యర్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఎత్తు నిబంధనల్లో మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం 154 సెంటీమీటర్ల ఎత్తు ఉండాల్సి ఉండగా, ఆ ఎత్తు లేనివారిని ఇన్నాళ్లూ కొలువులకు తీసుకోలేదు. తాజా ఉత్తర్వులతో వారందరికీ ఊరట లభించనుంది.
Similar News
News February 26, 2025
మహా శివరాత్రి.. కిక్కిరిసిన శ్రీశైలం

తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల తాకిడి మొదలైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని తె.జా 2.30 గంటల నుంచి అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో పవిత్రమైన రోజున పరమశివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి నంది వాహన సేవ, మల్లికార్జునుడి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు.
News February 26, 2025
కార్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఫార్ములా మర్చిపోవద్దు!

బ్యాంకు లోన్ తీసుకొని కారు కొంటున్నవారు 20/4/10 ఫార్ములాను తప్పక పాటించాలి. ఈ రూల్ ప్రకారం కార్ ఆన్ రోడ్ ప్రైజ్లో 20% డౌన్పేమెంట్ చెల్లించాలి. లోన్ గరిష్ఠ టెన్యూర్ 4ఏళ్లకు మించకూడదు. EMI మీ నెలవారీ సంపాదనలో 10శాతానికి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. బ్యాంకులు 8.70% నుంచి 10% వడ్డీతో కార్ లోన్లు ఇస్తున్నాయి. సిబిల్ స్కోర్ను బట్టి వడ్డీ శాతం అంచనా వేస్తారు.
News February 26, 2025
ఆత్మహత్యల ‘కోటా’.. అడ్డుకట్టకు చర్యలు!

రాజస్థాన్లోని కోటాలో ఎన్ని చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆత్మహత్యలకు <<14028051>>అడ్డుకట్ట<<>> పడటంలేదు. స్థానిక అధికారులు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో హాస్టల్ యజమానులు ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి వసూలు చేసేవారు. ఇకపై తొలుత రూ.2వేలు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పార్క్లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.