News March 18, 2024
ఎన్నికల నిర్వహణలో నిఘా బృందాల పాత్ర కీలకం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710779500075-normal-WIFI.webp)
ఖమ్మం: స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణలో నిఘా బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం సమావేశ మందిరంలో ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఎంసిసి బృందాలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల్లో నిఘా బృందాలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జిల్లాలో 15 ఎస్ఎస్టీ, 12 ఎఫ్ఎస్టీ, 27 ఎంసిసి బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Similar News
News July 8, 2024
నీటి ప్రవాహానికి ఊపిరాడక వాహనదారుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720432467672-normal-WIFI.webp)
మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్గా పోలీసులు గుర్తించారు.
News July 8, 2024
ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720420884263-normal-WIFI.webp)
తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.
News July 8, 2024
గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416024568-normal-WIFI.webp)
భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.