News January 31, 2025

SRPT: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాలిలా.. తిరుమలగిరి మండలం వెలిశాలకి చెందిన పొన్నం గణేశ్ డీసీఎం డ్రైవర్. గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద కోళ్ల లోడుతో వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గణేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News December 2, 2025

వరంగల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 124 కేసులు నమోదు

image

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 124 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలో 94, వెస్ట్ జోన్‌లో 6, ఈస్ట్ జోన్‌లో 2, సెంట్రల్ జోన్‌లో 22 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

News December 2, 2025

చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

image

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్‌, అసైన్డ్‌ ల్యాండ్స్‌, రింగ్‌రోడ్‌, ఫైబర్‌నెట్‌, లిక్కర్‌ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.

News December 2, 2025

కేయూలో నాన్‌ బోర్డర్లకు నిషేధం

image

కేయూ క్యాంపస్‌లో నాన్‌ బోర్డర్ల ప్రవేశాన్ని నిలిపివేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాంపస్‌లో శాంతి, భద్రత కోసం కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. పుట్టిన రోజులు సహా వ్యక్తిగత వేడుకలు, రాత్రి 9 తర్వాత ఫుట్‌పాత్‌లు-బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడాన్ని నిషేధించారు. నాన్‌ బోర్డర్లు వారం రోజుల్లో హాస్టల్స్ ఖాళీ చేయాలని, బోర్డర్లు తప్పనిసరిగా ఐడీ కార్డు కలిగి ఉండాలన్నారు.