News January 31, 2025

ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లను సన్మానించిన వరంగల్ సీపీ

image

ప్రమాద రహిత డ్రైవింగ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించి సన్మానం చేశారు. హనుమకొండ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాను అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాద రహిత డ్రైవింగ్ చేయాలని వారు పిలుపునిచ్చారు. రీజియన్‌లోని డీఎంలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు

image

*అక్టోబర్ 9, 2005: దీపావళి తర్వాత రెండు రోజులకు 5.38PM-6.05PM మధ్య వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 67 మంది మరణించారు.
*సెప్టెంబర్ 13, 2008: 6.27PMకు పోలీసులకు మెయిల్ వచ్చింది. దానికి స్పందించే లోపు 9 వరుస పేలుళ్లు జరిగాయి. 5 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 25 మంది చనిపోయారు.
*నేడు జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

News November 11, 2025

ప్రజావాణికి 29 ఫిర్యాదులు: రంగారెడ్డి కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు అందాయన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News November 11, 2025

మంచిర్యాల: ‘రైతులకు ఇబ్బందు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి’

image

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సూచించారు. Hyd నుంచి మంత్రులు, అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.