News January 31, 2025

కుంభమేళాలో జగిత్యాలకు చెందిన మహిళలు మిస్సింగ్

image

జగిత్యాల జిల్లా విద్యానగర్‌కు చెందిన నరసవ్వ (55) కుటుంబ సభ్యులతో, కొత్తవాడకు చెందిన రాజవ్వ (55) తన బంధువులతో కలిసి ఈ నెల 29న మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా మహా కుంభమేళాలో భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా నరసవ్వ, రాజవ్వ ఇద్దరు మిస్సయ్యారు. అయితే, వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 18, 2025

అఫ్జల్‌సాగర్‌లో గల్లంతు.. భీమలింగం బ్రిడ్జిపై లభ్యం

image

వలిగొండ (మం) సంగం భీమలింగం బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అఫ్జల్‌సాగర్ నాలాలో 4రోజుల క్రితం గల్లంతైన అర్జున్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.

News September 18, 2025

HYD: అర్జున్ గల్లంతు.. వలిగొండలో డెడ్‌బాడీ లభ్యం

image

అఫ్జల్‌సాగర్ నాలాలో <<17748449>>4రోజుల<<>> క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు పిల్లాపాపలతో అక్కడికి బయలుదేరారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News September 18, 2025

ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తాం: మంత్రి ఆనం

image

సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారన్నారు. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.