News January 31, 2025

సిద్దిపేట: అధికారులకు సీపీ సన్మానం

image

మానభంగం, పోక్సో కేసులో నేరస్థుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడడంలో కీలకపాత్ర వహించిన అధికారులను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఘనంగా సన్మానించి, అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. మానభంగం, ఫోక్సో కేసులో నేరస్థుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా నేరస్థుడికి జైలు శిక్ష పడడానికి కీలకపాత్ర వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీఐలు, సిబ్బందిని అభినందించారు.

Similar News

News July 6, 2025

వనపర్తి: జీవో నంబర్ 282ను వెంటనే రద్దు చేయాలి

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని దినం 8 గంటల నుంచి పది గంటలకు పెంచుతూ దొడ్డిదారిన జీవో నంబర్ 282 ను తెచ్చిందని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్మికులు దశాబ్దాలుగా పోరాడి ఎనిమిది గంటల పరిధిలో సాధించుకున్నారన్నారు. శ్రమదోపిడి చేసే అందుకే 10 గంటలకు పెంచారని, జీవో రద్దు చేయాలన్నారు.

News July 6, 2025

తుని: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

image

తునిలో జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల, టాయిలెట్లు పరిశీలించారు. పిల్లల ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షించాలని ప్రిన్సిపల్ యజ్ఞ‌ను ఆదేశించారు. మెరుగైన విద్యను అందించాలని సూచించారు.

News July 6, 2025

పోలీసు శాఖలో 2, 844 కేసులు రాజీ: ఎస్పీ

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించిన 2,844 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. 827 IPC కేసులు, 417 స్పెషల్ అండ్ లోకల్ లాస్ కేసులు, 143 ఎక్సైజ్ కేసులు, 1, 454 పెట్టీ కేసులు (చిన్నపాటి చట్టపరమైన నేరాలు)తో మొత్తం 2, 844 కేసులు రాజీ అయ్యాయన్నారు.