News January 31, 2025

విధుల్లో ప్రజల మన్ననలు పొందాలి: భద్రాద్రి ఎస్పీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సాయుధ బలగాల డీ మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు.15 రోజుల పాటు జిల్లా ఆర్మ్డ్ రిజర్వుడ్ సిబ్బంది ఇండోర్, ఔట్ డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ.. క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేసేవలు అందించి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News November 11, 2025

విషం కలిపేందుకు లొకేషన్లలో మొయినొద్దీన్ రెక్కీ

image

HYD: గుజరాత్ ATS ఆదివారం అరెస్టు చేసిన Dr. SD మొయినొద్దీన్ విచారణలో భయానక కుట్ర బయటపెట్టాడు. చైనాలో MBBS చేసిన మొయిన్ ఇక్కడ ఆముదం తదితర వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషం తయారు చేస్తున్నాడు. ఈ విషాన్ని దేవాలయాలు, వాటర్ ట్యాంక్స్, ఫుడ్ సెంటర్లలో కలిపి మాస్ మర్డర్స్‌కు కొందరితో కలిసి ప్లాన్ చేశాడని అధికారులు గుర్తించారు. ఇందుకు అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలో రద్దీ ఫుడ్ కోర్టులు పరిశీలించాడని పేర్కొన్నారు.

News November 11, 2025

విద్యతోనే పేదరికం నుంచి విముక్తి: కలెక్టర్

image

మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. “విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యం” అని ఆయన తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకున్నారు. మతభేదాలు లేకుండా విద్యను అందించాలనే ఆజాద్ ఆశయాన్ని ప్రస్తావిస్తూ, మైనారిటీ విద్యాఅభివృద్ధికి ప్రభుత్వం గురుకులాలు, బాలికల విద్యపై ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు.

News November 11, 2025

లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దు: కలెక్టర్

image

లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడమే కాకుండా కచ్చితంగా పాటించాలని సూచించారు. 18 ఏళ్ల నిండకుండా లైసెన్స్ పొందకుండానే వాహనాలు నడపొద్దని, సరైన శిక్షణ పొందకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. యువత రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు.