News March 18, 2024
పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి ప్రాథమిక హైస్కూలులో సోమవారం కలెక్టర్ అరుణ్ బాబు పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను తనిఖీ చేశారు. సత్యసాయి జిల్లాలో మొదటి రోజు తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిఓ భాగ్యరేఖ, డిఇఓ మీనాక్షి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 6, 2024
రేపు JNTUలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం జేఎన్టీయూలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి MBAలో 9 సీట్లు, MCAలో 4 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీలోని పరిపాలన భవనం నందు సోమవారం ఉదయం 9.00 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
News October 6, 2024
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
హిందూపురం మండలం దేవరపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం ఉదయం పోలీసులు గుర్తించారు. ఆయన వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నట్లు తెలిపారు. విషం తాగి మృతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుడి సమాచారం తెలిస్తే హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో తెలపాలని కోరారు.
News October 6, 2024
ఉచిత ఇసుక రవాణాకు పటిష్ట చర్యలు:
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పారదర్శకంగా ఉచిత ఇసుక సరఫరాను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం రాత్రి కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న కలిసి భూగర్భ ఘనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలో ఇసుక రీచ్లు, తవ్వకాలు, బుకింగ్, అమ్మకాలపై కలెక్టర్ వివరించారు.