News January 31, 2025
ఎన్టీఆర్: ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన ఎం.ఫార్మసీ 1వ, 3వ ఏడాది 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News February 24, 2026
NLG: కొత్త సొసైటీల ఏర్పాటుపై కసరత్తు

రైతులకు మరింత చేరువగా సేవలందించేందుకు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 64 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి (NLG-42, SRPT-44, YDD-21). కొత్త సంఘాల ఏర్పాటులో భాగంగా పాత సొసైటీల పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి కొత్త వాటిలో విలీనం చేయనున్నారు.
News February 24, 2026
అంగన్వాడీ టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్

TG: అంగన్వాడీ టీచర్లను ప్రీ స్కూల్ టీచర్లుగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 35,000+ మంది అంగన్వాడీ టీచర్లు ఉండగా, ఇందులో ఇంటర్ అర్హత ఉన్న 17,600 మందికి తొలుత శిక్షణనివ్వనున్నారు. ఈ 6 నెలల స్పెషల్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సులో 6 రోజులపాటు ఆఫ్లైన్ ట్రైనింగ్, 30 గంటలపాటు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి.
News February 24, 2026
అనకాపల్లి జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలి: కలెక్టర్

అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. 93,056 మంది నిరక్షరాస్యలను గుర్తించామన్నారు వీరికి చదువు చెప్పేందుకు 9,351 మంది వాలంటీర్లను నియమించామన్నారు. చదవడం రాయడం లెక్కలు చేయడం నేర్పించాలన్నారు. ఈనెల 28న ఫ్రీ ఫైనల్ అంచనా పరీక్ష నిర్వహిస్తామన్నారు.


