News January 31, 2025

కరీంనగర్: ముగిసిన రోడ్డు భద్రత మాసోత్సవాలు

image

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని కరీంనగర్ జిల్లా పమేలా సత్పతి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవం ముగింపు కార్యక్రమం సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నగరంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రతినెల అవగాహన కల్పించాలని రవాణాశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.

Similar News

News March 1, 2025

కరీంనగర్: ఫుట్ పాత్‌పై గుర్తుతెలియని వృద్ధుడి మృతి

image

కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి ముందు ఫుట్ పాత్‌పై గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఫుట్ పాత్ పైనే ఉంటున్న వృద్ధుడు, అనారోగ్యంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. వ‌ృద్ధుడిని ఎవరైనా గుర్తుపడితే కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

News March 1, 2025

కరీంనగర్: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:  కలెక్టర్ పమేలా

image

మార్చి 5 నుంచి 25 జిల్లాలో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 17799 మంది, రెండో సంవత్సరంలో 17763 మొత్తం 35562 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇందుకుగాను 37 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News February 28, 2025

కరీంనగర్: స్ట్రాంగ్ రూమ్స్‌కు సీల్ వేసిన రిటర్నింగ్ అధికారి

image

కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల బాక్స్‌లు నిల్వచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా ఇతర ముఖ్యఅధికారుల సమక్షంలో సీల్ వేశామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల బ్యాలెట్ బాక్స్‌లను వేరువేరుగా భద్రపరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!