News January 31, 2025

బీసీ బహుజన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మురళీకృష్ణ

image

తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సిద్దిపేటకు చెందిన సింగోజు మురళీకృష్ణ ఆచార్యులను నియమించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ శుక్రవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన వారి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 2, 2025

జనసేన కమిటీలో ప్రకాశం జిల్లా నేతలకు కీలక బాధ్యతలు.!

image

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను మార్చి 14న పిఠాపురంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నిర్వహణ కోసం కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో, జిల్లా జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం జనసేన ఇన్‌ఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్‌లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించినట్లుగా పార్టీ ప్రకటన విడుదల చేసింది.

News March 2, 2025

BREAKING: భారత్ గెలుపు.. సెమీస్‌లో ప్రత్యర్థి ఎవరంటే?

image

CT: చివరి గ్రూప్ మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. విలియమ్సన్ 81, శాంట్నర్ 28, యంగ్ 22, మిచెల్ 17, టామ్ 14, ఫిలిప్స్ 12 రన్స్ చేశారు. వరుణ్ 5 వికెట్లతో సత్తా చాటగా, కుల్దీప్ 2, అక్షర్, హార్దిక్, జడేజా తలో వికెట్ తీశారు. గ్రూప్ స్టేజీలో 3 మ్యాచ్‌లలోనూ గెలిచి 6 పాయింట్లతో IND టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లో AUSతో భారత్, SAతో కివీస్ తలపడనున్నాయి.
స్కోర్లు: భారత్ 249/9, కివీస్ 205/10

News March 2, 2025

శాసనసభ, మండలి ప్రోరోగ్ చేస్తూ ఆదేశాలు

image

తెలంగాణ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రోరోగ్ చేయకుండానే డిసెంబర్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపం, ఎస్సీ వర్గీకరణ, కులగణన నివేదికలపై ప్రకటనలు చేశారు. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, వాటిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. దీంతో సభను ప్రోరోగ్ చేయగా, త్వరలోనే శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

error: Content is protected !!