News January 31, 2025
కొమురవెల్లి మల్లన్న ఆదాయం @రూ.58,47,941

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 15 రోజుల్లో రూ.58,47,941 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 31 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల మిశ్రమ వెండి, 24 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 11 క్వింటాళ్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది, టీజీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
ఆసిఫాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

ASF జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పౌర సరఫరాల మేనేజర్ నర్సింగరావు రూ.75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దహేగాంలో వాసవి రైస్ మిల్లులో గత నెల 9న 3 లారీలను గుర్తించి అందులో పీడీఎస్ బియ్యం ఉన్నాయని పట్టుకున్న పౌర సరఫరా శాఖ మేనేజర్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. లారీ రిలీజ్ చేయడానికి రూ.75వేలు లంచం అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
News November 6, 2025
’FATHI’ ఆరోపణలు అవాస్తవం: ఐఏఎస్లు

TG: విద్యాశాఖ ఇన్ఛార్జి కార్యదర్శి దేవసేనపై ప్రయివేటు కాలేజీల సంఘం(FATHI) <<18207242>>ఆరోపణలు<<>> నిరాధారం, అవాస్తవమని IASల అసోసియేషన్ ఖండించింది. ఫతి ఆరోపణలు ఆమెను తక్కువ చేసేవే కాకుండా సివిల్ సర్వీసెస్ నైతికతను సమగ్రతను దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొంది. ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. విధుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటూ అంకిత భావంతో పనిచేసే అధికారులపై ఆరోపణలు తగవని హితవు పలికింది.
News November 6, 2025
వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించాలి: జేసీ

వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను జేసీ కొల్లాబత్తుల కార్తీక్ ఆదేశించారు. గురువారం జేసీ ఛాంబర్లో ధాన్యం కొనుగోలు కార్యకలాపాలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వరి కోతలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రేడ్-A రకం వరికి క్వింటా రూ.2,389, కామన్ రకం వరికి రూ.2,369 చెల్లించాలని అధికారులకు సూచించారు.


