News January 31, 2025

సిద్దిపేట: అవార్డులు అందజేసిన సీపీ

image

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట, అతిఉత్కృష్ట సేవా పతకాలు పొందిన అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి, సేవా పథకాలు అందజేశారు. ఉత్కృష్ట సేవా పథక్ పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు కే. శ్రీరామ్, కే.మల్లికార్జున్, మహిళా హోంగార్డు మమ్మద్ నసీమా, అతి ఉత్కృష్ట సేవా పథక్‌ను వెంకటరమణారెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, నారాయణ, యాదయ్య, ప్రభు, జీవన్, అలెగ్జాండర్ పొందారు.

Similar News

News November 12, 2025

VZM: ‘రుణాల రికవరీ వందశాతం ఉండాలి’

image

రుణాల రికవరీ వందశాతం ఉండాలని DRDA పీడీ శ్రీనివాస్‌ పాణి ఆదేశించారు. స్థానిక DRDA కార్యాలయంలో ‘మన డబ్బులు.. మన లెక్కలు’ కార్యక్రమంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. రుణాల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని కోరారు. గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో APD సావిత్రి, DPMలు చిరంజీవి, లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు.

News November 12, 2025

ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ!

image

TG: ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి రావడంతో వచ్చే ఏడాది నుంచి సీట్ల భర్తీని ఆన్‌లైన్ విధానంలో చేయాలని చూస్తోంది. దీంతో విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకోవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30వేలకు పైగా మేనేజ్‌మెంట్ సీట్లు ఉన్నాయి.

News November 12, 2025

త్వరలో రూ.10వేల పరిహారం: తుమ్మల

image

రాష్ట్రంలో మొంథా తుఫాన్ కారణంగా లక్షా 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 23,580, వరంగల్‌లో 19,736 ఎకరాల నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందాన్ని పర్యటించమని కోరామన్నారు. దెబ్బతిన్న పంటలకు త్వరలోనే ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.