News January 31, 2025

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి అక్కడి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో తెలుగు అసోసియేషన్స్, తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రేపు ఉదయం ఆయన అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

Similar News

News September 16, 2025

మరింత సులభంగా మూవీ షూటింగ్స్: దిల్ రాజు

image

TG: రాష్ట్రంలో సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ అని ఓ వెబ్ సైట్ రూపొందిస్తోంది. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే వారి మూవీకి కావాల్సిన లొకేషన్లు, అనుమతులు, టెక్నీషియన్లు, HYDతోపాటు రాష్ట్రంలోని హోటళ్లతో పాటు సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్ సైట్ రూపొందిస్తున్నాం’ అని FDC చైర్మన్ దిల్ రాజు తెలిపారు.

News September 16, 2025

మళ్లీ భూముల వేలం.. ఎకరాకు రూ.101 కోట్లు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. HYD ఐటీ కారిడార్‌ సమీపంలోని రాయదుర్గంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమికి అక్టోబర్ 6న ఈ-వేలం నిర్వహించనుంది. OCT 1 వరకు బిడ్ల దాఖలుకు అవకాశమిచ్చింది. రూ.2వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎకరాకు కనీస ధరను ఏకంగా రూ.101 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

News September 16, 2025

డిసెంబ‌రు క‌ల్లా గుంత‌ల ర‌హిత రోడ్లు: కృష్ణబాబు

image

AP: రాష్ట్రంలో 19వేల కి.మీ. రోడ్ల‌ను రూ.860 కోట్లతో గుంత‌ల ర‌హితంగా మార్చినట్లు రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ‘ఈ డిసెంబ‌రుక‌ల్లా ర‌హ‌దారుల‌ను గుంత‌ల ర‌హితంగా మార్చాల‌న్న‌దే ల‌క్ష్యం. మ‌రో 5946 కి.మీ. రోడ్ల‌ మరమ్మతులకు రూ.500 కోట్లు మంజూరు చేశాం. 8744 కి.మీ. జాతీయ‌ ర‌హ‌దారుల‌నూ బాగుచేశాం. PPP మోడ్‌లో 12,653 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయ‌నున్నాం’ అని తెలిపారు.