News February 1, 2025
వెదురు వస్తువుల తయారీతో ఆర్థికాభివృద్ధి: అదనపు కలెక్టర్

వెదురు వస్తువుల తయారీతో సంఘాల ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ మండలం సాలెగూడలో నిర్మాణంలో ఉన్న వెదురు ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెదురుతో వినూత్న వస్తువులు తయారు చేసే ప్రణాళిక రూపొందించాలన్నారు. యూనిట్ పూర్తిచేసే లోపు అవసరమైన వెదురు నిల్వల సేకరణకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
Similar News
News November 11, 2025
నిఠారి కిల్లింగ్స్: సురేంద్ర కోలికి సుప్రీంలో ఊరట

నిఠారి వరుస హత్యల చివరి కేసులో సురేంద్ర కోలి దోషి కాదని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. మిగతా కేసుల్లోనూ రిలీఫ్ పొందిన కోలి త్వరలో జైలు నుంచి విడుదల కానున్నాడు. నోయిడా శివారు నిఠారి గ్రామంలో 2006 DEC 29న మోహిందర్ పందేర్ ఇంటి వెనక డ్రెయిన్లో 8 మంది చిన్నారుల ఎముకలు లభ్యమయ్యాయి. దీనిపై దర్యాప్తు చేసిన CBI పందేర్, కోలి హత్యాచారాలకు పాల్పడ్డారని తేల్చింది. అయితే కోర్టుల్లో నిరూపించలేకపోయింది.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు వేసేందుకు యువతులు సైతం ఆసక్తి చూపించారు. యూసుఫ్గూడలోని పలు పోలింగ్ బూత్లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ ఓటర్లకు ఓటింగ్ ఛాలెంజ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యతను గుర్తు చేశారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని కొన్ని బూత్లలో రద్దీ లేదని టాక్.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. యూసుఫ్గూడలోని పలు పోలింగ్ బూత్లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ స్నేహితులకు సందేశం పంపుతున్నారు. యువత.. మీరూ కొంచెం ఆలోచించండి. ఓటు వేసి SMలో ఒక పోస్ట్ పెట్టండి. ఇంకా ఓటు వేయనివారిని పోలింగ్కు తీసుకెళ్లండి.


